Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు చిన్నారులు గల్లంతు
అంకారా : టర్కీ పశ్చిమ తీరంలో శరణార్థులతో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. పడవలో మొత్తం 35 మంది ప్రయాణించగా..వీరిలో 33 మందిని ప్రత్యేక సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన చిన్నారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పడవల్లో పరిమితికి మించి ప్రయాణీకులను తరలిస్తుండటంతోనే తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కోస్ట్గార్డ్ అభిప్రాయపడింది. కాగా, సిరియాలో 2011లో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఈనేపథ్యంలో లక్షలాది మంది సిరియన్లు ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. సముద్ర మార్గంలో ప్రయాణించే వలసదారుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. గతేడాది టర్కీకి 2.6 లక్షల మంది సిరియన్లు వలసవెళ్లినట్టు అంతర్జాతీయ శరణార్థి సంస్థ పేర్కొంది.