Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్: నిధుల లేమి సమస్య నుంచి గట్టెక్కడానికి ఐరాస పొదుపు చర్యలను చేపడుతోంది. దీనిలో భాగంగా కొత్త ఉద్యోగాల నియమకాల సంఖ్యను తగ్గించటమే కాకుండా.. రోజువారీ వ్యవహారాల్లోనూ సాధ్యమైనంతగా పొదుపు పాటిస్తోంది. ఎస్కలేటర్లు, ఏసీ వినియోగం తగ్గించాలని ఉద్యోగులకు సూచించింది. పరిస్థితులు మెరుగుపడే వరకూ ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. 'గత పదేండ్లలో ఇంతటి గడ్డు పరిస్థితిని చూడలేదు' అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సభ్యదేశాలు సకాలంలో ఐరాసకు తమ వాటా ప్రకారం నిధులు చెల్లించకపోవటంతో ఈ సమస్య వచ్చిపడిందన్నారు. 65 సభ్యదేశాలు 1.38 బిలియన్ డాలర్ల వరకు సమితికి బకాయి పడ్డాయి. ఇవి ఐరాసకు వెంటనే డబ్బు చెల్లించకపోతే డిసెంబర్ నాటికి ఉద్యోగులకు జీతభత్యాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుందని యూఎన్ సెక్రెటరీ ఇటీవలే సభ్యదేశాలకు లేఖలు రాశారు.