Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 35 మంది మృతి, నలుగురికి గాయాలు
రియాద్ : సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 35 మంది మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను అల్హమ్నా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా విదేశీ యులేనని అధికారులు ధ్రువీకరించారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...సౌదీ ప్రావిన్స్లోని మక్కా నగరంలో యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సు, ట్రక్కు ఢకొీన్నా యి. దీంతో, బస్సులో ప్రయాణిస్తున్న 35 మంది అక్కడి కక్కడే మృతి చెందారు. మక్కా నుంచి మదీనాకు బస్సు బయల్దేరిన సమ యంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల జాతీయతకు సంబం ధించిన వివ రాలను అధికారులు వెల్లడించలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియ రాలేదు. గతేడాది ఏప్రిల్లో ఇంధన ట్యాంకరు, బస్సు ఢకొీన్న ఘటనలో నలుగురు బ్రిటిషర్లు మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు.