Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
వాషింగ్టన్: పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచంలో భారత్ను మించిన అనువైన దేశం మరొకటి ఏదీ లేదని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే, పెట్టుబడిదారులను గౌరవించే వాతావరణం భారత్లో ఉన్నదని ఆమె అన్నారు. సంస్కరణలు కొనసాగించే దిశగా ప్రభుత్వం పని చేస్తున్నదని అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఆమె హామీ ఇచ్చారు. అమెరికాలోని ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయంలో ఆమె ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని ఫిక్కీ, యూఎస్-ఇండియా స్ట్రేటజిక్ అండ్ పార్టనర్షిప్ ఫోరమ్ సంయుక్తంగా నిర్వహించాయి. ఇప్పటికీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని నిర్మలాసీతారామన్ అన్నారు. భారత్లోని న్యాయవ్యవస్థ పనితీరులో కొంత నెమ్మదితనమున్నా, సమాజంలో పారదర్శకత ఉన్నదని ఆమె అన్నారు.