Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: వచ్చే ఏడాది జరగనున్న జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సుకు అమెరికా అతిథ్యం ఇవ్వనుంది. 2020 జూన్లో జరగబోయే ఈ సదస్సు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన గోల్ఫ్ క్లబ్ వేదిక కానుంది. ఈ విషయాన్ని అధ్యక్షుడి ముఖ్య అధికారి మిక్ ముల్వనేరు వెల్లడించారు. అయితే, ఈ సదస్సులో పర్యా వరణ మార్పులపై చర్చ, ప్రధాన అజెండాగా ఉండదని వైట్హౌస్ స్పష్టం చేసిం ది. వచ్చే ఏడాది జూన్లో జరగబోయే సదస్సుకు అమెరికాలోని 12 వేదికలను సదస్సు నిర్వాహకులు పరిశీలించారు. చివరికి మియామీలోని 'ట్రంప్ నేషనల్ డోరల్ గోల్ప్ క్లబ్'ను ఎంపిక చేశారు. ఈ ఏడాది ఆగస్టులో ఫ్రాన్స్లోని బియారిట్జ్ వేది కగా జీ-7 సదస్సు జరిగింది. ఆ సమయంలోనే తదు పరి సదస్సును తన గోల్ఫ్ క్లబ్ లో నిర్వహించాలని అధ్యక్షుడు ట్రంప్ సూచించారు. ఆయన ప్రతిపా దనకు సర్వత్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. వచ్చే ఏడాది జరగునున్న అధ్యక్ష ఎన్నికల్లో లబ్ది పొం దేందుకే ట్రంప్ నిర్ణయం తీసుకున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపించారు.