Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, చైనాలు డబ్ల్యూటీవో ట్యాగ్ను ఉపయోగించుకుంటున్నాయని ఆరోపణలు
వాషింగ్టన్: భారత్, చైనా దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలే కావంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. భారత్, చైనా దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలని ప్రపంచ వాణిజ్య సంస్థ ( డబ్ల్యుటీవో) ట్యాగ్ ఇచ్చింది. అయితే, డబ్ల్యుటీవో ట్యాగ్ను భారత్, చైనా దేశాలు పూర్తి స్థాయిలో వాడుకుంటున్నాయని ఆరోపించారు. ఈ రెండు దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూటీవోకు తాము లేఖ రాశామని అన్నారు. వీటిని అభివృద్ధి చెందుతున్న దేశాలుగా తాము పరిగణించమని స్పష్టం చేశారు. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిపిందే. మరోవైపు తమ ఉత్పత్తులపై భారత్ భారీగా సుంకాలను వేస్తోందని ఇప్పటికే ట్రంప్ పలుమార్లు విమర్శించారు. ఈ నేపథ్యంలో రెండు దేశాలపై ట్రంప్ మండిపడ్డారు. ఈ రెండు దేశాలు భరించలేనివిగా తయారయ్యాయని విమర్శించారు. చైనా, భారత్ను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా అమెరికా గుర్తించడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు.