Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారాంతాల్లో కార్యాలయాల మూసివేస్తున్నట్టు వెల్లడి
వాషింగ్టన్: బడ్జెట్ కొరత కారణంగా న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం రాబోయే వారాంతాల్లో (శని, ఆదివారాలు) మూతపడనున్నది. ఈ మేరకు ఐరాస తన ట్విట్టర్ పేజీలో 'నగదు సంక్షోభం కారణంగా ఐరాస కార్యాలయాలు వారాంతాల్లో మూసివేయబడతాయి' అని పేర్కొంది. దీనికి 'ఈ ఏడాది మీ దేశం ఐరాసకు రెగ్యులర్ బడ్జెట్ను అందచేసిందా?' అనే ట్యాగ్ను జోడించి ట్వీట్ చేసింది. కాగా, ఐరాస ప్రకటించిన ఓ పత్రంలో 131 సభ్య దేశాలు ఐరాసకు రెగ్యులర్ బడ్జెట్ను పూర్తిగా చెల్లించినట్టు వెల్లడించింది. గడువులోపు 34 దేశాలు మాత్రమే తమ రెగ్యులర్ బడ్జెట్ను పూర్తిగా చెల్లించాయని అందులో వివరించింది. ఐరాసలో మొత్తం 193 సభ్యదేశాలున్నాయి. ఐరాసాలో భారత రాయబారి, శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. ఐరాసకు తన బకాయిలన్నింటినీ సకాలంలో చెల్లించిన దేశాలలో భారత్ ఒకటని తెలిపారు. ఈ ఏడాదిలో భారత్ 23,253,808 డాలర్లు ఇచ్చిందని చెప్పారు. కాగా, దశాబ్దంలోనే ఘోరమైన నగదు సంక్షోభాన్ని ఐరాస ఎదుర్కొంటున్నదని ఐరాస అధ్యక్షుడు ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. వచ్చే నెల సంస్థ సిబ్బందికి వేతనాలు చెల్లించే విషయంలో ఇబ్బందులు పడే అవకాశము న్నదని తెలిపారు. అలాగే తమ ఖర్చులను సైతం తగ్గించుకునే క్రమంలో ఐరాస సిబ్బంది కార్యాలయాల్లోని లిప్టులను, ఏసీలను వాడకుండా స్వీయనియంత్రనను పాటిస్తున్నారని వివరించారు.