Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సబ్వే ఛార్జీల పెంపుదల ఉపసంహరణ
శాంటియాగో: చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా ఎట్టకేలకు ప్రజాగ్రహానికి తలొగ్గారు. ఇటీవల సబ్వే ఛార్జిలను పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై వెల్లువెత్తిన విద్యార్థి నిరసనలు హింసాత్మకంగా మారటంతో ఈ పెంపుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. ఛార్జీల పెంపుదలపై తలెత్తిన ఆందోళనలను అణచివేసేందుకు ఎమర్జెన్సీని ప్రకటించిన మరునాడే ఆయన ఈ ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రకటించటం విశేషం. విద్యార్థులు, ప్రజలు చేపట్టిన ఆందోళనలను అణచివేసేందుకు శాంటియాగో నగర వీధుల్లో సైన్యం గస్తీ తిరిగింది. 1990లో మాజీ సైనిక నియంత అగస్టో పినోచెట్ పాలనకు తెరపడిన తర్వాత సైన్యం రంగ ప్రవేశం చేయటం ఇదే తొలిసారి. ప్రజల ఆందోళనలను తాను అర్ధం చేసుకున్నానని అందువల్లే తాము చార్జీల పెంపుదల నిర్ణయాన్ని సస్పెండ్ చేస్తున్నానని పినేరా ఒక ప్రకటనలో వివరించారు. అయితే ఈ ఉపసంహరణతో నిరసనలకు, భద్రతా దళాల దాడులకు తెరపడుతుందా అన్న విషయం ఇంకా తెలియరాలేదు.