Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండోసారి బాధ్యతలు చేపట్టిన పీడీఐ-పీ పార్టీ నేత
జకార్తా : ఇండోనేషియా అధ్యక్షుడిగా పీడీఐ-పీ పార్టీ నేత జొకో విడోడో ( జొకోవి) మరోసారి ప్రమాణం చేశారు. ఈఏడాది ఏప్రిల్17న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో సిట్టింగ్ ప్రెసిడెంట్ జొకోవి మరోసారి పోటీ చేసి గెలుపొందారు. ఆయనకు 55.5 శాతం ఓట్లు ( 85,607,362 ఓట్లు) వచ్చాయి. ఆయన సమీప రాజకీయ ప్రత్యర్థి, గెరిండా పార్టీ నేత ప్రబోవో సుబియాంటోకు 44.5శాతం ఓట్లు ( 68,650,239 ఓట్లు) వచ్చాయి. మరో ఐదేండ్ల పాటు జొకోవి అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. ఆదివారం జకార్తాలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొ న్నారు. దేశాధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎలాం టి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా 30వేల మంది ప్రత్యేక భద్రతా సిబ్బందితో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. జొకోవి ప్రమాణ స్వీకారాన్ని తిలకించేం దుకు ఇండోనేషియన్లు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. అధ్యక్షుడి గా ప్రమాణం చేసిన తర్వాత జొకోవి స్థానిక మీడియాతో మాట్లాడారు. దేశ ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేస్తానని భరో సా ఇచ్చారు. నిరుద్యోగ సమస్యను నిర్మూలించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగు ల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటుచేసుకుంటు న్నాయని అందిన ఫిర్యాదులన్నింటిపై తక్షణమే విచారణకు ఆదేశిస్తానని అన్నారు. ఏ ఉద్యోగి అయినా అవినీతికి పాల్పడినట్టు విచారణలో తేలినట్టయితే ఉద్వాసన తప్పదని హెచ్చరించారు. పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. పేదరిక నిర్మూలన కోసం మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్టు తెలిపారు.
సేల్స్మెన్ టూ ప్రెసిడెంట్ : గతంలో ఫర్నీచర్ సేల్స్మెన్గా పనిచేసిన జొకోవి అంచెలంచలుగా ఎదిగారు. సేవా కార్యక్రమాలతో ప్రజల దృష్టిని ఆకర్షించారు. ప్రజలకు మరింత సేవ చేయాలనే థృక్పథంతో రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జొకోవి విధానాల పట్ల ఆకర్షితులైన ఓటర్లు ఆయనకు మరోసారి అవకాశం కల్పించారని సొంతపార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.