Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్తక, వాణిజ్యంలో నమ్మకాన్ని పెంచే చర్యలు చేపట్టాలి..
- వివిధ దేశాల ఆర్థిక విధాన రూపకర్తలకు ఐఎంఎఫ్ సూచన
వాషింగ్టన్ : ఆర్థిక మం దగమనం మరింత చిక్కప డుతోందనీ, వివిధ దేశాలు దీనిపై మేల్కోవాలని అం తర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) హెచ్చరించింది. 2008 తర్వాత మళ్లీ అలాంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నందున, ఆయా దేశాలు పరిస్థితికి అనుగుణంగా తమ ఆర్థిక విధానాల్ని మార్చుకోవాల్సిన అవసరముందనీ, వర్తక వాణిజ్యానికి అడ్డుగా నిలబడే అంశాల్ని విధాన రూపకర్తలు తప్పించాలనీ ఐఎంఎఫ్ సూచించింది. పరస్పర నమ్మకం పెంపొందించే వాణిజ్య ఒప్పందాలు, తద్వారా ప్రాంతీయ రాజకీయ ఉద్రిక్తతలకు ముగింపు పలకటం...వంటివి పెట్టుబడుల వాతావరణాన్ని మెరుగుపరుస్తాయని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది.
ఆర్థిక విధానాలు ఆర్థిక కార్యకలాపాల్ని పెంచేట్టు ఉండాలనీ, పెట్టుబడులకు, తయారీ, వాణిజ్య రంగాలకు అనుకూలంగా ఉండాలని ఐఎంఎఫ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లో ఎకానమిక్ కౌన్సిలర్, డైరెక్టర్గా ఉన్న గీతా గోపీనాథ్ చెప్పారు. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల సందర్భంగా ఆమె తన బ్లాగ్ పోస్ట్లో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి. ద్రవ్య చలామణిని పెంచే ఆర్థిక విధానాలు ఎంచుకోవాలి. స్థిరమైన ఆర్థికవృద్ధిని సాధించడానికి, నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టాలి. తద్వారా ఉత్పత్తిని మెరుగుపర్చుకోవాలి.
ప్రపంచ వాణిజ్యాన్ని ఏ దేశమూ కాదనుకోలేదనీ, దానిని మరింత మెరుగుపర్చుకోవటమే ప్రపంచం ముందున్న మార్గమనీ ఆమె అన్నారు. వస్తు తయారీరంగం, ప్రపంచ వ్యాణిజ్యంలో నెలకొన్న మాంద్యం ప్రస్తుత పరిస్థితులకు దారితీసిందని అభిప్రాయపడ్డారు. అధిక పన్నులు, వాణిజ్య, వర్తక ఒప్పందాల్లో అనిశ్చిత వాతావరణం ఆర్థికమాంద్యంను మరింత పెంచుతుందని హెచ్చరించారు. పెట్టుబడుల వాతావరణాన్ని, వస్తు డిమాండ్ను సైతం దెబ్బతీస్తుందని తెలిపారు.