Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2020లో మానవరహిత మిషన్ ప్రయోగం
బీజింగ్: వచ్చే ఏడాది అంగారక గ్రహాం పైకి అన్వేషణ కోసం చైనా మానవరహిత ''మార్స్ మిషన్ 2020'' కి స్వీకారం చుట్టింది. ఇందులో భాగంగా గురువారం మార్స్ ల్యాండర్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. బీజింగ్కు వాయువ్యంగా ఉన్న ఉత్తర హెబీ ప్రావిన్స్ ఈ పరీక్షకు వేదికైంది. ఈ సందర్భంగా చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ జాంగ్ కెజియాన్ మీడియాతో మాట్లాడారు. మార్స్ ల్యాండర్ పరీక్ష విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ పరీక్ష ''మార్స్ మిషన్' ముందడుగుగా అభివర్ణించారు. ఈ మిషన్ అంతరిక్షంలో ప్రయాణించడానికి ఏడు నెలలు పడుతుండగా, మార్స్పై ల్యాండింగ్కు ఏడు నిమిషాలు పడుతుందని తెలిపారు. ఈ మిషన్ లాంచింగ్కు శక్తిమంతమైన లాంగ్ మార్చి 5 రాకెట్ను అభివృద్ధి చేసినట్టు తెలిపారు. అలాగే రాకెట్ చాంగ్ -5 ప్రోబ్ ఈ ఏడాది చివరినాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో చంద్ర శిలల నమూనాలను తిరిగి తీసుకరా నున్నదని తెలిపారు.