Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లా పాజ్: బొలీవియా అధ్యక్షుడు ఈవో మోరెల్స్ రాజీనామాకు కారణమైన కుట్ర ప్రజలకు, సామాజిక, రాజకీయ శక్తులకు ఐదు పాఠాలు నేర్పుతోంది. వీటిని పరిగణనలోకి తీసుకుని భవిష్యత్ పరిణామాలను అనుసరించేందుకే ఈ విశ్లేషణ...
మొదటి అంశం: ఈవో నేతృత్వంలోని ప్రభుత్వం బొలీవియాను ఎంత మేరకు అభివృద్ధి చేసింది, ప్రజలకు సంపదను ఎలా పున్ణపంపిణీ చేసింది, పెట్టుబడులకు హామీ ఇస్తూ సూక్ష్మ, స్థూల ఆర్థికాంశాలను ఏ విధంగా మెరుగుపరిచిందన్న విషయాన్ని పక్కన పెడితే, సామ్రాజ్యవాదం తన ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వాన్ని అంగీకరించబోదన్న విషయం ఈ కుట్రతో మరోసారి స్పష్టమైంది.
రెండోది: అమెరికాకు చెందిన వివిధ సంస్థలు, వాటి ప్రతినిధులు, విద్యావేత్తలు లేదా జర్నలిస్టులు ప్రచురించిన అనేక కథనాలను పరిశీలిస్తే దాడికి సంబంధించిన సంకేతాలు ముందుగానే పంపిన విషయం అర్ధమవుతుంది. సోషలిస్టు విధానాలతో ప్రజాదరణ పొందిన ఈవో మోరెల్స్ ఆదరణను దెబ్బతీసేందుకు ఆయనను దొంగగా, అవినీతి పరుడుగా, నియంత లేదా అహంకారిగా ముద్ర వేసేందుకు వీరి రచనలు తోడ్పడ్డాయన్నది నిర్వివాదాంశం. ఈ లక్ష్యాన్ని తమకు తాము 'ఇండిపెండెంట్ జర్నలిస్టు'లమని చెప్పుకునే కిరాయి రచయితలకు, సామాజిక వార్తా హరులకు అప్పచెప్పారు. వీరంతా తమ రచనలతో తమ ఏకపక్ష వాదనలకు అనుకూలంగా ప్రజల ఆలోచనా ధోరణిని మళ్లించి, దేశీయ వాసులు, పేదలకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే.
మూడోది: ఈ పరిస్థితులు తలెత్తిన సమయంలో రాజకీయ నాయకత్వం, కులీన వర్గాలు ఈవో 'నియంతృత్వాని'కి తెరదించితేనే 'మార్పు' అంటూ ఊదరగొట్టాయి. మోరెల్స్కు వ్యతిరేకంగా పలు చిత్రాలు, పోస్టర్లను ప్రచురించాయి. మహిళా మేయర్ తల గొరిగి, ఎర్రటి పెయింట్ను ఆమె ముఖానిక పూసిన పోటోలను పోస్ట్ చేశాయి.
నాలుగోది: ఈ పరిస్థితుల్లో భద్రతా దళాలు రంగ ప్రవేశం చేశాయి. ఈ సందర్భంగా అమెరికాలోని సైన్యం, ప్రజలు, పలు ఇతర సంస్థలు నియంత్రిస్తున్న వ్యవస్థల గురించి ప్రస్తావించుకోవాలి. ఈవోకు వ్యతిరేకంగా కుహానా మేధావులు రెచ్చగొట్టిన ప్రజలకు ఈ వ్యవస్థలు సాయుధ శిక్షణను అందించాయి. మొరేల్స్కు వ్యతిరేకంగా వారికి రాజకీయ పాఠాలు నూరిపోశాయి. త్రివిధ దళాధిపతులకు సామ్రాజ్యవాద వ్యతిరేక శిక్షణా కార్యక్రమాన్ని మోరెల్స్ ప్రారంభించిన సమయంలో ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి అమెరికా అనుకూల నినాదాలు మిన్నంటాయి. భద్రతా దళాలు రంగం నుండి తప్పుకుని ఫాసిస్టు శక్తుల ఇష్టారాజ్యానికి వదిలేశాయి. ఉక్రెయిన్, సిరియా, ఇరాక్, లిబియా తదితర దేశాలలో ప్రభుత్వాలను గద్దెదించేందుకు ఫాసిస్టు శక్తులు ఎలా వ్యవహరించాయో, ఇక్కడ ఈ ప్రతీఘాత శక్తులు అలానే చెలరేగిపోయాయి. ఈ మూకలను రిక్రూట్ చేసుకుని, వాటికి దండిగా నిధులను మితవాదశక్తులు సమకూర్చాయి. ఈ గ్యాంగ్లు బీభత్సదాడులకు పాల్పడుతూ ప్రజలను భయపెట్టటంతో పాటు ప్రభుత్వ ప్రముఖులనూ బెదిరించాయి. ఇది సరికొత్త రాజకీయ-సామాజిక పరిణామం..ఫాసిస్టు శక్తులు తమ హింసాత్మక చర్యలతో చెలరేగిపోతే ప్రభుత్వం నిస్సహాయ స్థితిలోపడటం అనివార్యమవుతుంది.
అయిదవది: బొలీవియాలో శాంతి, భద్రతల పరిరక్షణా బాధ్యతలను ఎప్పుడూ పోలీసులు లేదా సైన్యానికి అప్పగించిన దాఖలాలు లేవు. ఈవో మోరెల్స్కు వ్యతిరేకంగా హింసాకాండ ప్రారంభమైనపుడు వారిని బుజ్జగించటం, ఫాసిస్టుల కవ్వింపులకు ప్రతిస్పందించకపోవటం వంటి ధోరణిని అనుసరించారు. ఆ శక్తులకు ఇది మరింత ధైైర్యాన్నిచ్చింది. ఈ పరిణామాల నుండి ఇకనైనా పాఠాలు నేర్చుకుంటామా? కాలమే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి.
అమెరికా కుట్రలను తిప్పికొట్టాలి
రోమ్/మాడ్రిడ్/ఏథెన్స్: బొలీవియాలో అమెరికా కుట్రను గ్రీస్కమ్యూనిస్టు పార్టీ (కెేకేఈ), ఇటలీ, స్పెయిన్, ఐర్లండ్ తదితర కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా ఖండించాయి. పార్టీలు బుధవారం నాడిక్కడ విడుదల జేసిన వేర్వేరు ప్రకటనల్లో అమెరికన్ సామ్రాజ్య వాద సరికొత్త దురాక్రమణను ఖండించాయి. అమెరికా కుట్రకు వ్యతిరేకంగా పోరాడు తున్న బొలీవియన్ ప్రజలకు, అక్కడి కమ్యూనిస్టు పార్టీకి అవి తమ పూర్తి సంఘీభావాన్ని తెలియజేశాయి. నాలుగు కమ్యూనిస్టు పార్టీల ప్రకటనల సారాంశం ఇలా ఉంది. 'మోరెల్స్ తన 14 ఏండ్ల పాలనలో బొలీవియా ప్రజలను పేదరికం, వెనుకబాటు నుంచి విముక్తి చేసి గౌరవప్రదమైన జీవితం గడిపేలా పలు చర్యలు తీసుకొచ్చారు. ఆర్థిక వ్యవస్థలో వ్యూహాత్మకంగా కీలకమైన రంగాలను జాతీయీకరణ చేశారు. బొలీవియన్ ప్రజల అవస రాలు తీర్చడం కోసం అమెరికన్ సామ్రాజ్యవాదుల మద్దతుతో బొలీవియన్ పెట్టుబడిదా రులు, గుత్త పెట్టుబడిదారీ సంస్థలతో ఆయన నేరుగా తలపడ్డారు. లాటిన్ అమెరికాను తిరిగి తన గుప్పెట్లో పెట్టుకోవడానికి అమెరికా సామ్రాజ్యవాదులు పన్నిన పన్నాగంలో భాగమే ఈ కుట్ర. క్యూబాకు వ్యతిరేకంగా ఆర్థిక దిగ్బంధనాన్ని తీవ్రతరం చేయడం, వెనిజులా, సాల్వెడార్, నికరాగ్వాలను అస్థిరపరిచేందుకు యత్నించడం, ఈక్వెడార్, చిలీలో ప్రజల తిరుగుబాటును క్రూరంగా అణచివేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయి. పెట్టుబడిదారులు తమకు లాభాలు వచ్చేలా చూసుకోవడానికి ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కడానికి ఏమాత్రం వెనుకాడవనడానికి చరిత్రలో అనేక ఉదాహరణలు న్నాయి. బొలీవియా అనుభవం కూడా ఇదే. బూర్జువా రాజ్యాన్ని నాశనం చేసి, దాని స్థానంలో కార్మిక రాజ్యాన్ని నెలకొల్పడం ద్వారానే కార్మికుల ప్రయోజనాలకు గ్యారంటీ ఏర్పడుతుందన్న లెనిన్ మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. లాటిన్ అమెరి కాలో గత రెండు మూడు దశాబ్దాలుగా సాగుతున్న రివల్యూషనరీ ప్రక్రియ ఈ సూత్రాన్ని అనుసరించడంలో పరిమితులున్నాయి. సామ్రాజ్యవాదం ఎప్పుడూ ప్రజలకు వ్యతిరేకమే. తన ప్రయోజనాలకు అడ్డు తగిలే ఏ ప్రభుత్వాన్ని అది సహించదు. అంతర్జాతీయ స్థాయి లో వర్గ పోరాటాలు తీవ్రతరమవుతున్న స్థితిలో ఏ ప్రభుత్వమూ తటస్థంగా ఉండజా లదు. అటో, ఇటో ఏదో ఒక వైపు నిలవాలి. దేశీయంగా ఉన్న కులీనులు, అంతర్జాతీయ సామ్రాజ్యవాదంతో కలసి పన్నిన కుట్ర ఫలితమే నేటి బొలీవియా సంక్షోభం. అమెరికా ఆధ్వర్యంలోని ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ (ఓఏఎస్), బొలీవియన్ పోలీసులు, సైన్యం కుట్రదారులకు బాహాటంగా కొమ్ముకాశాయి. మితవాద ప్రతిపక్షాల కుట్రకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన మోరెల్స్ మద్దతుదారులపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిం చాయి. బొలీవియాలోని వెనెజులా, క్యూబా ఎంబసీల వద్ద విధ్వంసానికి పాల్పడ్డాయి. వెనెజులా, చిలీ, తదితర లాటిన్ దేశాల్లో అమెరికా సాగిస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు కార్మిక, ప్రజా ఉద్యమాలను ఉధృతం చేయాలి' అని అవి పిలుపునిచ్చాయి.