Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రసాలియా/ బీజింగ్ : బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమైన అనంతరం సరిహద్దు వివాదానికి సంబం ధించి మరో సమావేశం నిర్వహించడానికి భారత్-చైనాలు అంగీకరించినట్లు అధికా రిక వర్గాలు తెలిపాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్దోవల్, చైనా జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ మంత్రి వాంగ్ యి నేతృత్వంలో 21వ దఫా భారత్ -చైనా సరిహద్దు చర్చలు గత ఏడాది నవంబర్లో చైనాలోని చెంగ్డులో జరిగిన సంగతి తెలిసిందే. సరిహద్దుకు వివాదానికి సంబంధించి మరో సమావేశం నిర్వహించనున్నారని, సరిహద్దు ప్రాంతా ల్లో శాంతి భద్రతల ప్రాముఖ్యతను పున రుద్ఘాటించారని విదేశాంగ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశానికి సంబంధించి షెడ్యూల్ను పేర్కొనలేదు. సరిహద్దుల్లో శాంతి, భద్రతలను కాపాడుకునేం దుకు ఇరు దేశాలకు చెందిన భద్రతా దళాల మధ్య సంబంధాలను మెరుగుపర్చడానికి కృషి చేయాలని ఇరు నేతలు ఉద్ఘాటించారు.