Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిక్స్ సదస్సులో వ్యాపారవేత్తలను కోరిన ప్రధాని మోడీ
బ్రెజిల్ : పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచంలోనే భారత్ అత్యంత అనువైన దేశమని ప్రధాని మోడీ అన్నారు. బ్రెజిల్లో జరుగుతున్న బ్రిక్స్ దేశాల సదస్సులో ఆయన పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా గురువారం జరిగిన బ్రిక్స్ దేశాల ఆర్థిక వృద్ధి సదస్సులో మోడీ మాట్లాడుతూ.. పెట్టుబడులు పెట్టే వారికి బారత్లో లెక్కలేనన్ని అవకాశాలున్నాయనీ తెలిపారు. భారత్లో స్థిరమైన ప్రభుత్వంతో పాటు వ్యాపారవేత్తలకు అనువైన అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. 2024 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్లకు చేరబోతున్నదనీ, అందులో మౌలికరంగం వాటానే ఒకటిన్నర ట్రిలియన్లు ఉంటుందని మోడీ వివరించారు. బ్రిక్స్ దేశాలు భారత్లో పెట్టుబడులు పెట్టి దేశవృద్ధిలో తమ ఉనికి చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఓవైపు దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనంతో కీలక రంగాల వృద్ధి కుంటుపడుతున్నా.. 'ప్రపంచ ఆర్థిక వృద్ధిలో బ్రిక్స్ దేశాలు 50 శాతాన్ని ఆక్రమించాయి. ప్రపంచవ్యాప్తంగా మాంద్యం పవనాలు వీస్తున్నా బ్రిక్స్ దేశాలు ఆర్థిక వృద్ధిని నమోదుచేస్తున్నాయి' అని మోడీ చెప్పడం గమనార్హం.