Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన రాజ్యాంగం అవసరమా ? వద్దా అనే అంశంపై
శాంటియాగో : నూతన రాజ్యాంగ నిర్మాణం చేపట్టాలా? వద్దా అనే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్టు చిలీ ప్రభుత్వం వెల్లడించింది. వచ్చే ఏడాది ఏప్రిల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది. విద్య, ఆరోగ్య సంరక్షణ బాధ్యతలను ప్రభుత్వమే చేపట్టాలనే ప్రధాన డిమాండ్లతో చిలీ పౌరులు గతనెలలో ఆందోళన బాటపట్టిన సంగతి తెలిసిందే. అయితే, పౌరులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులపై పోలీసులు విరుచుపడ్డారు. లాఠీలు ఝళిపించారు. బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన అల్లర్లలో 20 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అయితే, నూతన రాజ్యాంగ నిర్మాణం చేపట్టాలని కూడా పౌరులు డిమాండ్ చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య ఈ అంశంపై శుక్రవారం సుదీర్ఘ చర్చ జరిగింది.