Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వియత్నాం ఉపాధ్యాయుడికి 11ఏండ్ల జైలు
దేశద్రోహం కేసులో వియత్నాం ఉపాధ్యాయుడికి 11ఏండ్ల జైలుశిక్ష పడింది. ఈ మేరకు గెహాన్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ప్రాసిక్యూషన్ వెల్లడించిన వివరాల ప్రకారం...గ్వెయెన్ నాంగ్ టిన్(43) స్థానిక పాఠశాలలో మ్యూజిక్ టీచర్గా పనిచేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటారు. ప్రభుతాన్ని విమర్శిస్తూ ఫేస్బుక్లో అనేక పోస్టులు పెట్టారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసు అధికారులు పలు ఆధారాలను సేకరించారు. వియత్నాం ప్రభుత్వంపై వ్యతిరేకతతో నాంగ్టిన్ సామాజిక మాధ్యమాల్లో పలు పోస్టులు పెట్టినట్టు గుర్తించారు. ఇదిలా ఉండగా, పోలీసులు చూపిన ఫేస్బుక్ ఖాతాతో తనకు ఎలాంటి సంబంధం లేదని నాంగ్టిన్ తెలిపారు. ప్రభుత్వంపై తనకు ఎలాంటి వ్యతిరేకలేదని చెప్పారు. తనను అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు వ్యక్తులు నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించారని అన్నారు. నాంగ్టిన్ తరఫు న్యాయవాది వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది.