Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 4వేల ట్రాక్టర్లతో రాస్తారోకో
- ప్రభుత్వ విధానాలపై గళమెత్తిన రైతులు
బెర్లిన్ : జర్మనీలో అన్నదాతలు నిరసనలు చేపట్టారు. నిత్యం రద్దీగా ఉండే హామ్బర్గ్ నగరంలో 4వేల ట్రాక్టర్లతో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై గళమెత్తారు. రైతుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు కనబరుస్తోందని విమర్శించారు. విత్తనాలు, యూరియా, పశుగ్రాసం కొనుగోలుకు ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వడంలేదని అన్నారు. నిత్యావసర ధరలు మిన్నంటడంతో వ్యవసాయం చేయలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 'నో ఫామ్, నో ఫుడ్, నో ఫ్యూచర్' అని ముద్రించిన ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. హామ్బర్గ్ నగరంలో నిరసనలు మిన్నంటడంతో శుక్రవారం పర్యావరణ శాఖ మంత్రి నేతృత్వంలో కీలక భేటీ రద్దయిందని స్థానిక మీడియా తెలిపింది. సమావేశం ప్రారంభం కావాల్సిన కార్యాలయం ఎదుట రైతులు ట్రాక్టర్లు నిలిపి నిరసన తెలిపారని పేర్కొంది. గేన్సెమార్క్ స్క్వేర్ ప్రాంతమంతా రైతుల నిరసనలతో హెరెత్తింది. విత్తనాలు, పెస్టిసైడ్స్, యూరియా కొనుగోలు కోసం ప్రభుత్వం సబ్బిడీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. కాగా, జర్మనీలో గతనెలలోనూ రైతులు వీధుల్లోకి చేరుకొని ట్రాక్టర్లతో వినూత్న నిరసన చేపట్టారు. రైతుల సమస్యలను పరిష్కరించనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి జూలియా బాన్ భరోసా ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. అయితే, రైతుల సమస్యలపై ప్రభుత్వ స్పందన కొరవడటంతో తాజాగా మరోసారి నిరసనలు చేపట్టారు.