Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్: మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్పై తనకు ఎలాంటి పగ లేదని, రాజకీయాల కంటే ఆయన ఆరోగ్యం తనకు ఎంతో ముఖ్యమని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ స్పష్టం చేశారు. నవాజ్ షరీఫ్ను మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్లకుండా ఎగ్జిట్ కంట్రోల్ లిస్టు (ఈసీఎల్)తోపాటు నో ఫ్లై జాబితాలో పేరు పెట్టారనీ, తన సోదరుడికి ఏమైనా జరిగితే ఇమ్రాన్ ఖానే బాధ్యత వహించాల్సి ఉంటుందని నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్ ఆరోపించిన నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ తాజాగా వివరణ ఇచ్చారు. తన ప్రభుత్వం మానవత్వంతో నవాజ్ షరీఫ్కు విదేశాల్లో వైద్యచికిత్స చేయించుకునేందుకు చర్యలు తీసుకుందనీ, కాని ఈసీఎల్ జాబితాలో మాజీ ప్రధాని ఉన్నందున న్యాయ సహాయం పొందాలని ఇమ్రాన్ సూచించారు. కాగా నవాజ్ షరీఫ్ ఆరోగ్యం విషయాన్ని ఆయన కుటుంబసభ్యులే రాజకీయం చేస్తున్నారని ఇమ్రాన్ఖాన్ ఆరోపించారు. ఈసీఎల్ జాబితాలోనుంచి పేరు తొలగించేందుకు నవాజ్ షరీఫ్ ఇండెమ్నిటీ బాండ్ సమర్పించాలనీ, అలా బాండ్ సమర్పించకుంటే షరీఫ్ కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయిం చాలని ఇమ్రాన్ సలహా ఇచ్చారు. రూ. వంద కోట్ల పూచీకత్తు సమర్పించి, ఒకసారి నాలుగు వారాల పాటు విదేశాల్లో వైద్యచికిత్స పొందేందుకు అనుమతిస్తున్నట్టు పాక్ మంత్రిత్వశాఖ ప్రకటించింది. కాగా పూచీకత్తుపై నవాజ్ షరీఫ్ సోదరుడు లాహోర్ హైకోర్టును సంప్రదించగా కోర్టు నో ఫ్లై లిస్టులో నుంచి నవాజ్ పేరు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.