Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నిక ప్రచారంలో ట్రంప్ వాగ్దానం
వాషింగ్టన్: అమెరికాలో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల ప్రచారంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టి సారించారు. ప్రచారంలో అందరిని ఆకర్షించేలా వాగ్దానాలు చేస్తున్నారు. తనకు మళ్లీ అధికారాన్ని అప్పగిస్తే భారీగా పన్నులు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. రిపబ్లికన్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే మధ్యతరగతి వర్గాలకు భారీగా పన్నులు తగ్గిస్తామని వాగ్దానం చేశారు.
తన పాలనలో పన్ను చెల్లింపులో మినహా యింపు, సవరణలు, సరైన వాణిజ్య భాగస్వాములను ఎంచుకోవటం వల్లే అమెరికా సుస్థిరమైన ఆర్ధికాభి వృద్ధి సాధించిందని అన్నారు. అయితే ట్రంప్ గత ఎన్నికల హామీలనే నేరవేర్చలేదని ప్రత్యర్ధులు అంటున్నారు. భారీగా పన్నులను తగ్గిస్తే.. కేవలం ధనవంతులకు మాత్రమే లబ్ధి చేకూరుస్తుందనీ. ఇప్పటికే ఆయన పాలనలో అమెరికా ఆర్థిక వ్యవస్థ 1 ట్రిలియన్ డాలర్లకు పడిపోయిందని విమర్శించారు. ఇతర దేశాలతో వాణిజ్య యుద్ధమే ప్రధాన కారణమనీ, దీని వల్ల వ్యాపార రంగంలో ఉత్పత్తులు, పెట్టుబడులు తగ్గాయనీ, దేశ ఆర్ధికవ్యవస్థ మందగమనం దిశగా పయనిస్తున్నదని ఆర్థిక వేత్తలు అభిప్రాయ పడుతున్నారు. 2020లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ సహా పలువురు ట్రంప్నకు గట్టి సవాల్ పోటీ ఇవ్వనున్నారు.
ద్వంద్వ నీతి బహిరంగ విచారణపై ట్రంప్ స్పందన
అభిశంసన తీర్మానంలో బహిరంగ విచారణ సరిగా జరగడం లేదనీ. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ద్వంద్వ నీతిని పాటిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. బహిరంగ విచారణలో భాగంగా ఉక్రెయిన్ లో మాజీ అమెరికా రాయబారి మార్రీ యవనోవిచ్పై కాంగ్రెస్ ప్రశ్నల వర్షం కురింపించింది. బదులుగా ఆమె.. ఉక్రెయిన్ అధ్యక్షుడితో ట్రంప్ ఫోన్ సంభా షణపై పలు అంశాలను బయటపెట్టారు.తనను అకస్మాత్తుగా రాయబారి పదవి నుంచి తొలగించారని ఆమె ఆరోపించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడితో జరిపిన ఫోన్ సంభాషణపై ట్రంప్ తనను ఏ విధంగా ఒత్తిడి తెచ్చారో వివరించారు. ప్రమాదమని తనను పదవి నుంచి తప్పించారని ఆరోపించారు. అనంతరం యవనోవిచ్ రాయబారిగా పనితీరు బాగాలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆమె సోమాలియాలో పనిచేస్తున్నప్పుడు ఏవిధమైన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయో అందరికీ తెలుసునన్నారు. అనంతరం ఆమె ఉక్రెయిన్కు వెళ్లిందని తెలిపారు ట్రంప్ అభిశంసనకు మద్దతుగా కాంగ్రెస్ ఎంపిక కమిటికిీ చెందిన ఐదుగురు డెమొక్రాటిక్ సభ్యులు ఆమోదం తెలుపుతూ ఓటు వేశారు.