Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంగో: కాంగోలో తిరుగుబాటు దారులు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 15 మంది పౌరులు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయ పడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతు ల సంఖ్య పెరిగే అవకాశముంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ...ఉగాండ సరిహద్దులోని అటవీ ప్రాం తాన్ని స్థావరాలుగా మల్చుకున్న డెమోక్రటిక్ అలైన్డ్ ఫోర్సెస్ (ఏడీఎఫ్) తిరుగుబాటుదారులు కొన్నేండ్లుగా బీభత్సం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో మిలిటెంట్ల ఏరివేతకు కాంగో ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. యూఎన్ శాంతిదూతల సాయంతో ఏడీఎఫ్ మిలి టెంట్ల జాడ కనిపెట్టింది. మిలిటెంట్ల ఏరివేత కోసం కాంగో బలగాలు కూం బింగ్ ఆపరేషన్ చేపడుతున్నాయి. బలగాల ఆపరేషన్ను వ్యతిరేకిస్తూ పౌరులను లక్ష్యంగా చేసుకొని మిలిటెం ట్లు దాడులకు పాల్పడుతున్నారు.