Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25 మంది మృతి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో వరదలు పోట ెత్తాయి. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్య స్తమైంది. వరదల్లో చిక్కు కొని 25 మంది మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. రోడ్లపై వరద నీరు వచ్చిచేరండంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. విద్యా, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. బలమైన ఈదురుగాలులు వీయడంతో అనేక చోట్ల ఇండ్లపైకప్పులు ఎగిరిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. పంజాబ్ తూర్పు ప్రాంతంలో, హెల్మండ్ ప్రావిన్స్ల్లో కుండపోత వర్షం కురుస్తోంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.