Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14వేల మందిని ఖాళీ చేయించిన అధికారులు
బెర్లిన్ : జర్మనీలోని డోర్ట్మండ్ నగరంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు లభ్యమయ్యాయి. ఈనేపథ్యంలో 14వేల మంది స్థానికులను ఖాళీచేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించి నట్టు అధికారులు తెలిపారు. ఓ ఇంటి నిర్మాణం కోసం చేపట్టిన తవ్వకాల్లో బాంబులు బయటపడ్డాయని అన్నారు. ఒక్కో బాంబు బరువు 250 కిలోగ్రాములు ఉన్నదని అన్నారు. ఒక బాంబు బ్రిటన్ ఆర్మీకి చెందినదని, మరో బాంబు అమెరికా సైన్యానికి చెందినదని అన్నారు. కాగా, జర్మనీలో గతంలోనూ పేలని రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబుల లభ్యమయ్యాయి. గతేడాది సెప్టెంబర్లో హానోవర్ నగరంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి 250కిలోగ్రాముల బాంబు లభ్యమైంది. దీంతో, 15వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.