Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చేనెలలో భారత్లో పర్యటించ నున్నారు. అయితే, పర్యటన తేదీలను ఇంకనూ ఖరారు చేయలేదు. ఇరుదేశాధికారులు తేదీల ఖరారు పనిలో నిమగమై ఉన్నారు. వచ్చేనెల రెండు లేదా మూడో వారంలో ట్రంప్ భారత్లో పర్యటించే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపినట్టు 'హిందూస్థాన్ టైమ్స్' పేర్కొంది. అయితే ట్రంప్పై అక్కడి సెనేట్లో అభిశంసన ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై జరిగే చర్చ.. తదనంతర పరిణామాల ఆధారంగానే ఆయన పర్యటన తేదీ ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ అంశంపై శ్వేతసౌధం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గత సంవత్సర గణతంత్ర వేడుకలకు ట్రంప్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించినప్పటికీ.. ఆయన సున్నితంగా నిరాకరించిన విషయం తెలిసిందే. ముందే ఖరారైన కార్యక్రమాల కారణంగా రాలేకపోతున్నానని అప్పట్లో తెలిపారు.