Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు మృతి
కోనార్కీ : పశ్చిమ ఆఫ్రికా దేశమైన గినియాలో అధ్యక్షుడికి వ్యతిరేకంగా నిరసనలు ఉధృతమయ్యాయి. రాజ్యాంగ సవరణ చేపట్టి మరోసారి అధ్యక్ష పీఠం దక్కించుకోవాలని ప్రస్తుత అధ్యక్షుడు అల్ఫా కాండె(81) యోచిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈమేరకు ఆయన ఓ బిల్లును రూపొందించి పార్లమెంట్లో ప్రవేశపె ట్టాలని భావిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పటికే రెండు పర్యాయాలు అధ్యక్షుడి పదవి చేపట్టిన కాండె మరోసారి ప్రెసిడెంట్ పీఠం కోసం ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోనార్కీ నగరంలో వేలాది మంది నిరసనకారులు భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీకి ప్రతిపక్ష నేతలు నేతృత్వం వహించారు. నిరసన కారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. రహదారులపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. భద్రతా బలగాలు ఆందోళనకా రులపై రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. భద్రతా బలగాలకు, నిరసనకారు లకు మధ్య జరిగిన అల్లర్లలో ఇద్దరు పౌరులు మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిరసనకారులు తమ ఆందోళన కార్యక్రమాలను ఉపసంహరించు కోవాలని అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, అధ్యక్షుడి వైఖరిని నిరసి స్తూ గతేడాది అక్టోబర్ నుంచి గినియాలో నిరసనలు కొనసాగుతున్నాయి. భద్రతా బలగాలకు, నిరసన కారులకు మధ్య జరిగిన అల్లర్లలో ఈనెల14నాటికి 20 మంది మృతి చెందారు. 12 మంది గాయపడ్డారు. వందలాది మందిని పోలీసులు నిర్బం ధించారు. అక్రమ నిర్బంధానికి గురైన వారిలో ఆరుగురు హక్కుల సంఘం నేతలు కూడా ఉన్నారు. గినియాలో హక్కుల ఉల్లంఘన ఘటనలు బాగా పెరిగిపోయాయని రైట్స్ గ్రూప్స్ విమర్శిస్తున్నాయి. ఇదిలా ఉండగా, గినియాలో ఫిబ్రవరి16న పార్ల మెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో 13 మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును విని యోగించుకునే అవకాశముందని ఎలక్టోరల్ కమిషన్ వెల్లడించింది. అయితే, ఈ ఎన్నికలను బహిష్కరిం చాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.