Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీరుట్ : లెబనాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మళ్లీ ప్రారంభ మయ్యాయి. మంగళవారం బీరుట్ నగర వీధుల్లోకి నిరసనకారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. జాతీయ పతాకం, ప్లకార్డులు, బ్యానర్లు చేబూని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. రహదారులపై టైర్లు దహనం చేశారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. నిరసన కార్యక్రమాల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నట్టు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. నిరసనకారులు సెంట్రల్ బ్యాంకు బయట ధర్నా చేపట్టారు. లెబనాన్ గవర్నర్, ఆయన విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. పలువురు ఖాతాదారులు బ్యాంకుల్లో జమ చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. కాగా, లెబనాన్లో అవినీతి రాజ్యమేలుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పాలనపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర ధరలు మిన్నంటడంతో సామాన్యప్రజలు ఇబ్బంది పడుతున్నారు.లెబనాన్ ఆర్థికాభివృద్ధి మందగమనంలో కొనసాగుతోంది. గతేడాది అక్టోబర్ 29న లెబనాన్లో దేశవ్యాప్త నిరసనలు ప్రారంభమ య్యాయి. ప్రభుత్వ విధానాలపై ప్రజలు నిరసన గళం వినిపించారు. ప్రజాందోళలు హింసాత్మకంగా మారడంతో ప్రధాని సాద్ హరీరీ తన పదవికి రాజీనామా చేశారు. డిసెంబర్లో హస్సన్ దియాబ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అవినీతికి పాల్పడ్డ ఆరోపణలు ఎదుర్కొన్న పీఎం తన పదవికి రాజీనామా చేయడంతో నిరసనకారులు ఆందోళనలు విరమించారు. అయితే, దియాబ్ కూడా మాజీ ప్రధాని పంథానే అనుసరిస్తుండటంతో ప్రజాం దోళలు మరోసారి భగ్గుమన్నాయి. ట్రిపోలీ, అక్కార్ ప్రావిన్స్ల్లో నిరసనకారులు కదంతొక్కారు. ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.