Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఐరాసలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తేందుకు పాక్ చేసిన ప్రయత్నాన్ని భారత్ తిప్పికొట్టింది. పాకిస్తాన్ తన కుట్రలను పక్కనపెట్టి ఇరుదేశాల మధ్య సంత్సంబంధాలపై దృష్టి సారించాలని హితవు పలికింది. ఐరాస భద్రతా మండలి బుధవారం ఓ ఆఫ్రికన్ దేశానికి చెందిన అంశంపై చర్చించేందుకు పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో కాశ్మీర్ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చేందుకు పాకిస్తాన్ ప్రయత్నించింది. ఈ అంశంపై కలగజేసుకున్న ఐరాస.. కాశ్మీర్ అంశం భారత్, పాక్ దేశాల ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేసింది.