Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 21 మంది మృతి
డమాస్కస్ : సిరియాలో వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 21 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశ ముంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... తిరుగుబాటుదారుల జనాభా అధికంగా ఉన్న ఇద్లిబ్ ప్రావిన్స్లోని అరీహా నగరంలోని కూరగాయల మార్కెట్ను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 21 మంది మృతి చెందారు. ఈ దాడులకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. కాగా, ఈప్రాంతంలో ఐఎస్ మెరుపుదాడులకు పాల్పడుతోంది. తాజా దాడులు కూడా ఐఎస్ పనేనని పోలీస్ అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, అరీహా మార్కెట్పై దాడులకు పాల్పడింది సిరియా బలగాలేనని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా, 2011 నుంచి సిరియాలో అంతర్యుద్ధం కొనసాగుతున్నది. సిరియా అధ్యక్షుడు అస్సద్ను గద్దె దించేందుకు ఐఎస్తో పాటు ఇక్కడి రెబల్స్ గ్రూపులు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలకు, మిలిటెంట్ గ్రూపులకు మధ్య జరిగిన అల్లర్లలో 1.7 లక్షల మంది మృతిచెందగా, లక్షలాది మంది ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు.