Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరాన్పై కక్ష సాధింపు చర్యలకు ఈయూ వత్తాసు : జవాద్ జరీఫ్
టెహ్రాన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంటే యూరోపియన్ యూనియన్ (ఈయూ) వత్తాసు పలుకుతోందని ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జరీఫ్ తెలిపారు. ఇరాన్ ఆర్థికవ్యవస్థను దిగజార్చాలని అమెరికాతో పాటు ఈయూ కూడా కుట్ర పన్నిందన్నారు. అందుకే, ఇరాన్ నుంచి చమురు ఎగుమతుల కోసం గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను ఈయూ రద్దు చేసుకుందన్నారు. 2015లో ఇరాన్తో అణు ఒప్పందం కుదుర్చుకోవడంలో ఈయూ కీలక పాత్ర పోషించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ఒప్పందంలోని నిబంధనలను ఈయూ ఉల్లంఘంచిం దన్నారు. చారిత్రాత్మక ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడమే కాకుండా మిత్రదేశాలను కూడా ఈ డీల్ నుంచి బయటకు రావాలని ఒత్తిడి పెంచిందన్నారు. అణు ఒప్పందం నుంచి వైదొలగాలని బ్రిటన్, ఈయూ, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలపై ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారనని జవాద్ జరీఫ్ తెలిపారు.
అంతేగాకుండా, భారీ ఆంక్షలు మోపి ఇరాన్ ఆర్థికవ్యవస్థను దెబ్బతీసేందుకు ట్రంప్ కుట్ర పన్నారని విమర్శించారు. అణు ఒప్పందంలోని నిబంధనలను పున: సమీక్షించుకోవాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కోరుతున్నారని అన్నారు. ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖాసీం సులేమాని మృతి చెందిన అనంతరం మధ్యప్రాఛ్యంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోందని అన్నారు. గల్ఫ్ దేశాల్లో విదేశీ బలగాల మోహరింపు కారణంగానే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. తక్షణమే విదేశీ బలగాలన్నీ ఇరాక్ భూభాగం నుంచి వెళ్లిపోవాలని జవాద్ జరీఫ్ డిమాండ్ చేశారు. ఒకవేళ విదేశీ బలగాలు వైదొలగకుంటే రానున్న రోజుల్లో దేశ సరిహద్దులు దాటేంత వరకు బలగాలను తరిమికొట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇరాన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని ఏ దేశం ప్రయత్నించినా ప్రత్యక్ష దాడులు తప్పవని హెచ్చరించారు. ఈయూ బలగాల లక్ష్యంగా ఇరాన్ వాయుసేన దాడులకు పాల్పడే అవకాశాలు న్నాయని హెచ్చరించారు.
ఇరాక్లోని బహ్రెయిన్ నగరంలో అమెరికా బలగాలు, అబూదాబిలో ఫ్రాన్స్ సైన్యం, ఇరాక్లో బ్రిటన్, జర్మనీ దళాలు పహారా కాయాల్సిన అవసరమేంటని ఆయన ప్రశ్నించారు. విదేశీ బలగాల మోహరింపు కారణంగానే మధ్య ప్రాఛ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని అన్నారు.