Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 మందికి గాయాలు
వాషింగ్టన్ : ఇరాక్లోని యూఎస్ సైనిక స్థావరాలపై ఈనెల 8న ఇరాన్ క్షిపణుల దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 11 మంది అమెరికా సైనికులు గాయపడినట్టు పెంటగాన్ శుక్రవారం ధ్రువీకరించింది. గాయపడ్డవారంతా సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. కాగా, ఈనెల 3న బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయటకు వెళ్తున్న ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖాసీం సులేమాని కాన్వారును లక్ష్యంగా చేసుకొని అమెరికా క్షిపణుల దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఇరాన్ ఆర్మీ చీఫ్ మృతిచెందారు. ఈ ఘటన అనంతరం మధ్య ప్రాఛ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడింది. ఈనెల 8న ఇరాక్లో అమెరికా సైనికులు మోహరించి ఉన్న ఆర్మీ శిబిరాలపై మెరుపుదాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 186 మంది అమెరికా సైనికులు మృతిచెందినట్టు ఇరాన్ ప్రకటించింది. అయితే, ఇరాన్ ప్రకటనను అమెరికా ఖండించింది. ఇరాన్ వాయుసేన దాడుల్లో తమ సైనికులెవరూ చని పోలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని పేర్కొంది. ఇరాన్లోని చరిత్రాత్మక, సాంస్కృతిక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని ప్రతి దాడులకు పాల్పడతామని అమెరికా హెచ్చరిం చింది. తాజాగా, ఇరాన్ దాడుల్లో అమెరికా సైనికులు గాయపడినట్టు పెంటగాన్ అంగీకరించడం గమనార్హం.