Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- నెలరోజుల్లో లొంగిపోతేనే అప్పీల్కు అనుమతి
ఇస్లామాబాద్: దేశద్రోహం కేసులో ఇస్లామాబాద్ ప్రత్యేక కోర్టు విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ .. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కానీ ఆయనకు కోర్టులో చుక్కెదురయింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించలేమంటూ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. ఈ కేసులో పిటిషనర్ ఇప్పటివరకు లొంగిపోనందువల్ల పిటిషన్ను తిరస్కరిస్తున్నామని తేల్చిచెప్పారు. అలాగే అప్పీల్ దాఖలు చేయడానికి ముందు దోషి లొంగిపోవాలని పేర్కొన్నారు. నెల రోజులోపు ముషారఫ్ లొంగిపోవాలనీ, లేకపోతే అప్పీల్ చేసుకునే హక్కును కూడా కోల్పోతారని కోర్టు స్పష్టంచేసింది.
2007లో రాజ్యాంగాన్ని రద్దు చేశారంటూ ముషారఫ్పై అప్పటి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లింలీగ్-నవాజ్(పీఎల్ఎం-ఎన్)ప్రభుత్వం న్యాయపోరాటం మొదలుపెట్టింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో ముషారఫ్ తీవ్ర అనారోగ్యం పాలయ్యానంటూ విదేశీ ఆసుపత్రుల్లోనే ఎక్కువగా దర్శనమివ్వడం ప్రారంభించారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా తీవ్రమైన కేసుల్లో చిక్కుకుని అనారోగ్యానికి చికిత్స అంటూ లండన్ వెళ్లి అక్కడ ఓ రెస్టారెంట్లో కనిపించడం గమనార్హÛం. అలాగే పాకిస్థాన్ చరిత్రలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 కింద మాజీ ఆర్మీ చీఫ్ను విచారించి, శిక్ష విధించడం ఇదే మొదటిసారి.