Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాంధీనగర్: ఆర్థిక మాంద్యం కారణంగా కేంద్రం దివాళా అంచున నిలబడి ఉన్నదని బీజేపీ మాజీ నాయకుడు యశ్వంత్ సిన్హా విమర్శించారు. అన్ని రంగాల్లోనూ డిమాండ్ పడిపోయిన కారణంగా దేశ ఆర్థికవ్యవస్థ మునుపెన్నడూ లేనివిధంగా ఘోరమైన సంక్షోభం గుండా వెళ్తున్నదని వెల్లడించారు. ఆయన సీఏఏకు వ్యతిరేకంగా చేపట్టిన గాంధీశాంతి యాత్ర గుజరాత్లోని అహ్మదాబాద్కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవస్థ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించే వ్యూహంలో భాగంగానే మోడీ ప్రభుత్వం సీఏఏను ముందుకు తెచ్చిందని ఆయన పునరుద్ఘాటించారు.