Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేగ్ : జెక్రిప బ్లిక్లోని ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. 36 మంది గాయ పడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశ ముంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...వెజ్పిరిటీ నగరంలోని ఓ భవనం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో స్థానిక ప్రజలు భయబ్రాం తులకు గురయ్యారు. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పేశారు. మృతుల కుటుంబాలకు జెక్రిపబ్లిక్ ప్రధాని ఆండ్రీస్ బాబిస్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటా మని భరోసా ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్టు పోలీస్ అధికారులు తెలిపారు.