Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 38 మంది మృతి
సనా : యెమెన్లో సైనిక శిబిరాన్ని లక్ష్యంగా చేసుకొని మిలిటెంట్లు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 38 మంది సైనికులు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. సైనికాధికారులు తెలిపిన వివరాల ప్రకారం....ఆదివారం మారిబ్ ప్రావిన్స్లోని సైనిక శిబిరంపై మిలిటెంట్లు విరుచుకు పడ్డారు. ఈ ఘటనలో 38 మంది సైనికులు మృతి చెందారు. ఆర్మీ క్యాంపుపై మూడు క్షిపణుల ప్రయోగం జరిగిందన్నారు. కాగా, ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటిం చుకోలేదు. అయితే, గతంలో జరిగిన అనేక దాడులకు బాధ్యత వహిస్తున్నట్టు హౌతీ తిరుగుబాటు దారులు ప్రకటించుకున్నారు. ఈ దాడులు కూడా హౌతీ తిరుగుబాటుదారుల పనేనని సైనికాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అల్ ఎక్బారియా మీడియా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం... ఉగ్రదాడిలో 60 మంది సైనికులు మృతి చెందారు.