Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హ్యారీ దంపతులు అనూహ్య నిర్ణయం
లండన్ : తమ రాచరికపు హోదాను వదులుకునేందుకు, ప్రజా నిధుల స్వీకరణ నిలిపివేసేందుకు బ్రిటన్ రాజు హ్యరీ ఆయన భార్య మేఘన్ అంగీకరించారు. రాచరికపు విధుల నుంచి తాము తప్పుకుంటామని ప్రకటించడంతో ఈ అంశంపై వారం రోజుల పాటు తీవ్ర చర్చలు జరిగాయి. తాజాగా దంపతులు 'రాచరికపు హోదా'ను వదులుకునేందుకు సిద్ధమయ్యారని బకింగ్ హామ్ ప్యాలెస్ నుంచి శనివారం ఓ ప్రకటన విడుదలైంది. సాధారణ జీవితంపై మక్కువతోనే ఈ దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 'అనేక నెలల పాటు జరిగిన సంభాషణలు, ఇటీవల జరిగిన చర్చల తర్వాత, నా మనవడు, ఆయన కుటుంబం నిర్మాణాత్మక ఆలోచనల వైపు మళ్లినందుకు ఎంతో ఆనందంగా ఉంది. స్వతంత్య్రంగా జీవించాలన్న వారి కోరికకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది' అని క్వీన్ ఎలిజిబెత్ -2 పేర్కొన్నారు.