Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్రమత్తమైన అధికారులు
- కేసులు గుర్తించేందుకు చర్యలు
బీజింగ్ : చైనాలో 'సార్స్' (సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరి సిండ్రోమ్)కు సంబంధించి ఆదివారం 17 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురి కేసులు తీవ్రంగా ఉండగా, వాటిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. దాదాపు 30-79 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటి వరకు వూహాన్లో 62 మందికి వైరస్ సోకిందని, వీరిలో 19 మంది వైరస్ బారి నుండి విముక్తులై ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని, మిగిలిన వారిని ఒంటరిగా ఉంచి చికిత్స అందిస్తున్నారని వారు చెప్పారు. వైరస్ సోకిన వారిలో ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందారు.వైరస్ సోకిన వారిని గుర్తించడానికిగానూ తొలుత నగరంలోని నిమోనియా కేసులను పరీక్షిస్తున్నామని, తర్వాత దశలో అనుమానాస్పద కేసులను గుర్తించే పనిని ప్రారంభిస్తామని, నమూనా పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. వైరస్ సోకిన వారి సంఖ్య అధికారికంగా గుర్తించిన దాని కంటే అత్యధికంగా 1700కు చేరుకునే అవకాశాలున్నాయని లండన్లోని ఇంపీరియల్ కాలేజ్లో ఉన్న గ్లోబల్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఎనాలిసిస్కు చెందిన ఎంఆర్సీ సెంటర్ శాస్త్రవేత్తలు శుక్రవారం హెచ్చరించారు.
వైరస్ సోకడానికి కేంద్రంగా భావిస్తున్న 'సీ ఫుడ్'మార్కెట్ నుండి అది సోకినట్టు కొన్ని కేసుల్లో కనిపించడం లేదని వారు తెలిపారు. ఈ వైరస్ మనుష్యుల నుంచి మనుష్యులకు సోకినట్టు ఇప్పటి వరకు ధ్రువీకరణ కాలేదు. అయితే ఈ అవకాశాన్ని తోసిపుచ్చలేమని వూహాన్ హెల్త్ కమిషన్ అంతకుముందు తెలిపింది. థారులాండ్లో రెండు, జపాన్లో ఒక కేసు కూడా నమోదైనట్టు సమాచారం.