Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్రమత్తమైన డబ్ల్యుహెచ్ఓ
బీజింగ్: చైనాలో కొత్త వైరస్ శరవేగంగా విస్తరిస్తూ ప్రపంచానికే పెనుముప్పుగా మారను న్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యపై అప్రమత్తమైన డబ్ల్యుహెచ్ఓ దీనిపై చర్చించేందుకు బుధవారం అత్యవసర భేటీకి జరగనుంది. కొత్త కరోనా వైరస్ వ్యాప్తితో నాలుగో వ్యక్తి మరణించినట్టు చైనా ప్రకటించటంతో డబ్ల్యుహెచ్ఓ అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. తొలుత వుహాన్ నగరంలో వెలుగు చూసిన ఈ వైరస్ బీజింగ్ షాంఘయి నగరాలకు విస్తరించింది. ఇప్పటికే 217 వైరల్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదవగా, అందులో 198 కేసులు వుహాన్ నగరంలోనే నమోద య్యాయని, మరో నాలుగు కేసులు జపాన్, ద.కొరియా, థారులండ్ల్లో నమోదయ్యాయని డబ్ల్యుహెచ్ఓ వర్గాలు వెల్లడించాయి. వుహాన్ నగరంలో వెలుగు చూసిన కొత్త కరోనా వైరస్ న్యూమోనియా కేసులను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం వుందని చైనా అధ్యక్షుడు సీ జిన్పింగ్ దేశ ప్రజలనుద్దేశించి జాతీయ టీవీలో చేసిన ప్రసంగంలో చెప్పారు. వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయా దేశాలకు వెళ్లే పర్యాటకులపై ఆంక్షలు విధించే అంశాన్ని డబ్ల్యుహెచ్ఓ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. బుధవారం నాటి భేటీలో ఈ మేరకు నిపుణులు సూచనలు చేసే అవకాశం ఉందని డబ్ల్యుహెచ్వో వర్గాలు చెబుతున్నాయి.
ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికా, ఆస్ట్రేలియా, భారతో పాటు అనేక ఆసియా దేశాల విమానాశ్రయాలలో ప్రయాణీకుల స్క్రీనింగ్ ప్రక్రియను ప్రారంభించినట్టు అధికారులు చెప్పారు. 2003లో సార్స్ వైరస్ ఉనికిని వెలుగులోకి తెచ్చిన చైనా శాస్త్రవేత్త ఝాంగ్ నన్షాన్ మీడియాతో మాట్లాడుతూ ఈ కొత్త వైరస్ వ్యక్తి నుంచి వ్యక్తికి సులభంగా సంక్రమిస్తుందని, అయితే ఇది ఇంకా ఆరంభదశలోనే వుండటంతో 2003 స్థాయి విపత్కర పరిస్తితులను ఇప్పుడే అంచనా వేయలేమని అన్నారు. సార్స్ వైరస్ వ్యాప్తితో 2003లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే.