Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రంప్ నోట కాశ్మీర్ మాట
- దావోస్ సదస్సులో ఇమ్రాన్తో మంతనాలు
దావోస్: పాకిస్థాన్ కొరుకున్నట్టయితే కాశ్మీర్ సమస్య పరిష్కారానికి సహకరిస్తానని మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్న ఆయన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్తో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలతో పాటు కాశ్మీర్ అంశంపై కూడా చర్చ జరిగిందన్నారు. పాకిస్థాన్తో మనుపెన్నడూ లేనిస్థాయిలో సత్సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. భారత్-పాక్ మధ్య సంబంధాలను నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. కాశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానంటూ గతంలో పలుసార్లు ట్రంప్ చేసిన ప్రతిపాదనను భారత్ ఖండించిన విషయం తెలిసిందే. కాశ్మీర్ పూర్తిగా అంతర్గత వ్యవహారమని, దీనిపై మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పింది. అయినా ట్రంప్ ఆ మాటలేవీ పట్టించుకోకుండా కాశ్మీర్ అంశంపై పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు. వచ్చే నెల ట్రంప్ భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనారహం.
మరోవైపు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్, ఇమ్రాన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకొంది. కాశ్మీర్ విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ 'అతిపెద్ద అంశం'గా అభివర్ణించారు. అంతర్జాతీయ వేదికలపై తమ వాదన చెల్లకపోవడంతో.. ఓ ద్వైపాక్షిక అంశంలోకి మూడో వ్యక్తి జోక్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని వీడే వరకు కాశ్మీర్పై పాక్తో చర్చించేది లేదని భారత్ గతంలో స్పష్టం చేసింది.