Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 36 మంది పౌరులు మృతి
వాగడూగు: బుర్కినాఫాసో ఉగ్రదాడులతో ఉలిక్కిపడింది. ఈ దాడుల్లో 36 మంది మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... నగ్రావోగో ప్రాంతంలోని ఓ మార్కెట్పై మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 32 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. ఈ దాడి జరిగిన అనంతరం పొరుగు గ్రామంలోకి చొరబడిన మిలిటెంట్లు మరో నలుగురిపై కాల్పులకు తెగబడ్డారు. ఈరెండు దాడుల్లో 36 మంది మృతి చెందారు. మిలిటెంట్ల ఏరివేత కోసం బుర్కినాఫాసో సర్కారు ప్రత్యేక చర్యలు చేపట్టింది. మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకొని ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తోంది. ప్రభుత్వ చర్యలపై మిలిటెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా, గతనెల బుర్కినాఫాసోలో జరిగిన దాడిలో 35మంది పౌరులు మృతిచెందిన విషయం తెలిసిందే. గత నాలుగు ఏండ్లుగా ఇక్కడ ఐఎస్ అరాచకాలు సృష్టిస్తోంది. దీంతో రంగంలోకి దిగిన ఫ్రాన్స్ సైన్యం.. ఉగ్రవాద ముఠాలు స్వాధీనం చేసుకున్న అనేక ప్రాంతాల్ని తిరిగి సొంతం చేసుకునేందుకు అక్కడి ప్రభుత్వానికి సహకరిస్తోంది. ఈ క్రమంలో బుర్కినాఫాసో సైన్యానికి ఇటు ఫ్రాన్స్, అటు అమెరికా శిక్షణ ఇస్తున్నాయి.