Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు
వాషింగ్టన్ : అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక డీఎస్పీ కార్మెన్ బెస్ట్ తెలిపిన వివరాల ప్రకారం...సీటెల్లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం వద్ద కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. కాగా, బుధవారం మెక్డొనాల్డ్ ఫాస్ట్ఫుడ్ సెంటర్ జరిగిన కాల్పుల ఘటనకు తాజా ఘటనతో సంబంధాలున్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఘటనాస్థలంలోని సీసీటీవీ ఫుజేజ్లను పరిశీలిస్తున్నామని అన్నారు. నిందితుడు కాల్పులకు పాల్పడ్డ కారణం తెలియరాలేదని అన్నారు. పరారీలో ఉన్న నిందితుని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని అన్నారు.