Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కతా : వెనిజులాపై ఆంక్షలను ఎత్తివేయాలని బొలీవియా రిపబ్లిక్ ఆఫ్ వెనిజులా దౌత్యవేత్త కొరమోటో గోడీ అమెరికానుడిమాండ్ చేశారు. తమ దేశంపై అమెరికా ఆంక్షలు కొనసాగుతుండటంతో సరైన వైద్య సదుపాయాలు అందకపోవడంతో రెండేండ్లలో 40వేల మంది చిన్నారులు మృతిచెందారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కోల్కతాలోని లాటిన్ అమెరికా, రష్యా కాన్సులేట్ అధికారులతో ఆమె మాట్లాడారు. భారత్-వెనిజులా మధ్య 60ఏండ్ల నుంచి వాణిజ్య సంబంధాలు కొనసాగుతున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని అన్నారు. అధ్యక్షుడు నికోలస్ మదురో అనుసరిస్తున్న విధానాల కారణంగానే వెనిజులా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా 30లక్షల ఇండ్ల నిర్మాణాల కోసం వెనిజులా ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించిందన్నారు. నిరుపేదల సంక్షేమం కోసం మదురో అహర్నిశలు పాటుపడుతున్నారని అన్నారు. తమ దేశంపై అగ్రరాజ్యం ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ నిరుపేదల సంక్షేమం కోసం మదురో కృషి చేస్తున్నారని ఆమె చెప్పారు. వెనిజులా పర్యాటక రంగాన్ని దెబ్బతీయాలని అమెరికా కుట్ర పన్నిందన్నారు. వెనిజులాలో 96శాతం చమురు నిల్వలున్నాయని అన్నారు. వెనిజులాలోని పరిస్థితులను అద్దంపట్టేలా చూపించేందుకు ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా గోర్కీ సదన్లో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశామని అన్నారు.