Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా రక్షణ విభాగం వెల్లడి
వాషింగ్టన్: ఇరాక్లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ జరిపిన ప్రతీకార దాడిలో 34 మంది సైనికుల ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమైనట్టు పెంటగాన్ అధికారులు వెల్లడించారు. ఈనెల 8న జరిగిన ప్రతీకార దాడిలో గాయపడిన సైనికులకు మెదడు సంబంధిత సమస్యలు తలెత్తినట్టు గుర్తించారు. ఈ విషయాన్ని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్లో అదికారికంగా ప్రకటించింది. ఈదాడిలో గాయపడిన సైనికులను చిక్సిత నిమిత్తం జర్మనీకి తరలించి, అనంతరం అమెరికాకు తీసుకెళ్లినట్టు వెల్లడించారు. ఈ విషయం ముందుగానే బయటికి రాకూడదని అధ్యక్షుడు ట్రంప్ని మీడియా కోరినట్టు తెలుస్తున్నది. సైనికులకు పెద్ద ప్రమాదమేమీ లేదని.. 'కేవలం తలనొప్పి' అంటూ ఆయన తేలిగ్గా కొట్టిపారేయడం గమనార్హం. దాడి జరిగిన మరుసటి రోజు అమెరికా సైనికులకు ఎటువంటి గాయాలు కాలేదని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. గాయాలైన సమాచారం ఆలస్యంగా వెలుగులోకి రావడంపై పెంటగాన్ వివరణ ఇచ్చింది. పూర్తి వైద్య పరీక్షల అనంతరం నివేదికలతో సహా సమాచారం అంచెలంచెలుగా ఉన్నతాధికారులకు చేరడానికి సమయం పట్టిందని వివరించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ గాయాల్ని 'ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజ్యురీస్'గా వ్యవహరిస్తున్నారు. క్షిపణి పేలుడు వల్ల వాతావరణ పీడనంలో మార్పులు సంభవించి ఈ తరహా సమస్యలు తలెత్తుతాయని వైద్యులు తెలిపారు.