Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 22మంది మృతి, 1000 మందికిపైగా గాయాలు
అంకారా: టర్కీని మరోసారి భూకంపం కుదిపేసింది. తూర్పు టర్కీలోని ఇలాజిజ్ ఫ్రావిన్స్ సివ్రిస్ జిల్లాలో శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. ఈ ఘటనలో 22 మంది చనిపోగా, వెయ్యి మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. పలు భవనాలు నేల మట్ట మయ్యాయి. మరోవైపు గడ్డకట్టే చలిలో భూకంపం ధాటికి ప్రజలు భయంతో ఇండ్ల నుంచి వీధుల్లోకి పరుగులు పెట్టారు. టర్కీ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం భూకంపం తర్వాత 60సార్లు ప్రకంపనలు నమోదయ్యాయి. టర్కీకి పొరుగు దేశాలైన సిరియా, లెబనాన్లోనూ భూప్రకం పనలు సంభవించాయి. దాదాపు 400లకుపైగా రిస్కూ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటు న్నాయి. భూకంపం తర్వాత 30మంది అదృశ్య మైనట్టు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై టర్కీ అధ్యక్షుడు రెసిప్ టయ్యిప్ ఎర్డొగాన్ ట్విట్టర్లో స్పందించారు. సహాయక చర్యల్లో అధికారులు నిమగమ య్యారనీ, భూకంప బాధితులను అన్ని విధా లుగా ఆదుకుంటామని పేర్కొన్నారు. భూకంపం వల్ల ఇలాజిజ్ ప్రావిన్సుల్లో 13 మంది, మలాత్యా ప్రావిన్సుల్లో ఐదుగురు మృతిచెందినట్టు టర్కీ పర్యావరణ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
బాధితుల కోసం పాఠశాలలు, స్పోర్ట్స్ సెంటర్స్, గెస్ట్ హౌస్లలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అమెరికా భూభౌతిక సర్వే ప్రకారం ఈ భూకంపం రిక్టర్ స్కేల్పై 6.7గా నమోదయ్యింది. టర్కీలో తరుచూ భూకంపాలు సంభవించి వందల మంది ప్రాణాలు కోల్పోతుంటారు. 1999లో సంభవించిన భారీ భూకంపం వల్ల దాదాపు 17వేల మందిని మృతి చెందిన విషయం తెలిసిందే.