Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : యూరోపియన్ యూనియన్ (ఈయూ) పార్లమెంట్ సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశ పెట్టింది. భారత్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నదని ఆరోపించింది. ఈయూలోని 24 దేశాలకు చెందిన 154 మంది సభ్యులు ఈ తీర్మానాన్ని ఆమోదించారు. త్వరలోనే ఈ చట్టంపై సమగ్ర చర్చ జరపనున్నారు. అనంతరం దీనిపై ఈనెల 30న ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ తీర్మానంలో ప్రధానంగా సీఏఏ, ఎన్నార్సీ చట్టాల వల్ల ముస్లింలకు అన్యాయం జరుగుతుందని పేర్కొంది. అంతేకాకుండా ఈ చట్టం కారణంగా వారు తమ పౌరసత్వం కోల్పోయే ప్రమాదం ఉందని అందులో తెలిపింది.