Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెక్సికో : తమపై జరుగుతున్న హింసను నిరసిస్తూ మెక్సికో మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఇటీవల చోటుచేసుకున్న 25 ఏండ్ల ఇంగ్రిడ్ ఎస్కెమిల్లా అనే యువతి హత్యతో మహిళలు ఆగ్రహించారు. నిరసన ఆందోళనలు చేపట్టారు. ఇంగ్రిడ్ హత్యను నిరసిస్తూ శుక్రవారం పెద్ద సంఖ్యలో అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టారు. 'మరో హత్య జరగ కూడదు' అని నినదించారు. అధ్యక్ష భవన తలుపులపై రక్త వర్ణంతో ''మహిళా ద్వేషుల రాజ్యం (ఫెమిసైడ్ స్టేట్)'' అని రాశారు. ప్రేమికుల దినోత్సవం (వాలంటెన్స్ డే) నాడు మహిళలు నిర్వహించిన ప్రదర్శన, చిన్నాభిన్నమైన ఆమె మృతదేహాన్ని పత్రికలు ప్రచురించడంతో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ''ఫెమిసైడ్స్'' పేరుతో దారుణంగా హత్యకు గురవుతున్న మహిళల ఉదంతాలలో ఇది తాజా ఉదాహరణ అని నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న పలువురు పేర్కొన్నారు. 2017లో తన కుమార్తెను కోల్పోయిన లిలియా ఫ్లోరెన్షియో గ్యుర్రెరొ ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవలం ఇంగ్రిడ్ మాత్రమే ఫెమిసైడ్స్కు బలవ్వలేదని, వేలాది మంది ఉన్నారని పేర్కొన్నారు. ఒకవైపు నిరసన ఆందోళనలు కొనసాగుతుండగానే గ్యుర్రెరో అధ్యక్ష భవనంలోకి ప్రవేశించి మహిళలపై హింసను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుల్ లాపెజ్ అబ్రేడర్కు విజ్ఞప్తి చేసింది. దీనిపై ఆయన సానుకూలంగా స్సందించారు. మెక్సికోలో రోజుకు సగటున 10 మంది మహిళలు హత్యకు గురవుతున్నారు.