Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన కొలంబియన్ నేషనల్ స్ట్రైక్ కమిటీ
- నయా ఉదారవాద విధానాలు, ప్రతిపక్ష నాయకుల హత్యలపై ఆగ్రహం
బొగోటా : కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డాక్యూ మార్క్వెజ్ పాలనకు వ్యతిరేకంగా ప్రజాందోళన ఉధృతమవుతున్నది. డాక్యూ ప్రభుత్వం అమలుజేస్తున్న నయా ఉదారవాద విధానాలు, ప్రతిపక్ష నేతల హత్యలకు వ్యతిరేకంగా 'ద కొలంబియన్ నేషినల్ స్ట్రైక్ కమిటీ' (సీఎన్పీ) వరుస ఆందోళనలకు, నిరసనలకు పిలుపునిచ్చింది. గత ఏడాది నవంబరు నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు, సమ్మెలు జరుగుతున్న నేపథ్యంలో సీఎన్పీతో డాక్యూ ప్రభుత్వం చర్చలకు దిగివచ్చింది. అయితే ఈ చర్చలు విఫలం కావటంతో వరుసగా నిరసనలు, ఆందోళనలు జరపబోతున్నట్టు సీఎన్పీ ప్రకటించింది. ఈ నిరసనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఫిబ్రవరి 21న దేశవ్యాప్త సమ్మె చేపట్టబోతున్నట్టు సీఎన్పీ తెలిపింది. కొలంబియన్ ఫెడరేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ వర్కర్స్ కూడా ఈ సమ్మెలో పాల్గొంటామని ప్రకటించారు