Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బమాకో : పశ్చిమాఫ్రికా దేశమైన మాలిలోని తీవ్రరూపం దాల్చిన జాతి వైషమ్యాలలో భాగంగా ఒగోస్సగౌ గ్రామంపై శుక్రవారం ఉదయం సాయుధులు దాడి చేశారు. ఈ దాడిలో 21 మంది మృతి చెందడమో, గల్లంతవ్వడమో జరిగిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది ఇదే గ్రామంలో పౌరులు పెద్ద ఎత్తున ఊచకోతకు గురయ్యారు. ఇటీవల సంవత్సరాలలో ఇంతటి భారీ పౌర హననం ఎన్నడూ జరగలేదు. ఒగోస్సగౌలో శుక్రవారం జరిగిన దాడిలో సాయుధులు పలు నివాసాలను తగలబెట్టారని, పశుసంపదను లూటీ చేశారని మాలి ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ దాడులకు బాధ్యులెవ్వరో ప్రభుత్వం ప్రకటించలేదు.