Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 40 మంది మృతి
బమాకో : మాలీలో తిరుగుబాటుదారులు బీభత్సం సృష్టించారు. మూడు వేర్వేరు ఘటనల్లో జరిగిన దాడుల్లో 40 మంది మృతిచెందారు. మృతుల్లో 9 మంది సైనికులు ఉన్నారు.మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం....సెంట్రల్ మాలీలోని ఓ కుగ్రామంలోకి తిరుగుబాటుదారులు చొరబడి గ్రామస్థుల ఇండ్లను తగులబెట్టారు. అనంతరం గావ్ ప్రాంతంలోని సైనిక శిబిరంలోకి చొరబడి మెరుపుదాడికి దిగారు. ఈ రెండు ఘటనల్లో 40 మంది మృతిచెందారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. మాలీలో 2012 నుంచి ఐఎస్ అరాచకాలకు పాల్పడుతోంది. తిరుగుబాటుదారులు, ఉగ్రదాడుల వరుస దాడులతో భీతిల్లిన గ్రామస్థులు ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు వలసవెళ్తున్నారు. కాగా, గతనెలలో ఒగసాగౌ గ్రామంపై తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 160 మంది మృతిచెందారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు డోగాన్ మిలిటెంట్లు ప్రకటించుకున్నారు.