Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా ఆదివారం మరోసారి రాకెట్ దాడులు జరిగాయి. ఈ విషయాన్ని పెంటగాన్ అధికారులు వెల్లడించారు. గతేడాది అక్టోబరు నుంచి అమెరికా ఆస్తులపై దాడులు జరగడం ఇది 19వ సారి అని తెలిపారు. యూఎస్ రాయబార కార్యాలయం లక్ష్యంగా ఎన్ని రాకెట్లతో దాడి జరిగిందనే విషయం ప్రకటించలేదు. ఈ ఘటనలో తమ సిబ్బంది ఎవరూ గాయపడలేదని అన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. అమెరికా మాత్రం ఇది కచ్చితంగా ఇరాన్ మద్దతుదారుల పనే అని ఆరోపిస్తోంది. కాగా, గతనెల3న బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖాసీం సులేమాని కాన్వారును లక్ష్యంగా అమెరికా డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో సులేమాని సహా 10 మంది మృతిచెందారు. మృతుల్లో పాపులర్ మోబిలైజేషన్ ఫోర్సెస్ డిప్యూటీ చైర్మెన్ అబూ మహ్దీ అల్ ముహందీస్ కూడా ఉన్నారు. ఈ ఘటన అనంతరం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఇరాక్ భూభాగంలో 5,200 మంది అమెరికా సైనికులు మోహరించి ఉన్నారు. వీరంతా ఇరాక్ సైనికులకు శిక్షణ ఇస్తున్నారు. ఇరాక్ భూభాగం నుంచి సులేమానిపై రాకెట్ లాంఛర్ దాడి జరిగింది. ఈ ఘటన అనంతరం ఇరాక్ భూభాగంలో ఉన్న విదేశీ బలగాలు వెనక్కి వెళ్లిపోవాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇరాక్లోనూ నిరసనలు హౌరెత్తాయి. ఇరాక్లోని విదేశీ బలగాలు వెనక్కి వెళ్లిపోయేంత వరకు అమెరికా శిబిరాలపై దాడులకు పాల్పడతామని మిలిటెంట్ గ్రూపులు హెచ్చరించాయి. తామంతా ఇరాన్ సర్కారుకు మద్దతుగా నిలిచినట్టు తెలిపాయి.