Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్చి ఫాస్టర్ సహా 24 మంది మృతి, 10 మందికి గాయాలు
ఔగదౌగౌ : బుర్కినాఫాసోలో ఆగంతకులు బీభత్సం సృష్టించారు. యాగా ప్రావిన్స్లోని పాన్సీ నగరంలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో చర్చి ఫాస్టర్ సహా 24 మంది మృతిచెందారు. మరో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఆగంతకులు మరో ముగ్గురు చిన్నారులను అపహరించినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. బౌన్డోర్ కమ్యూన్ నగర మేయర్ సిహాన్రీ ఒసాంగోల తెలిపిన వివరాల ప్రకారం...పాన్సీ నగరంలో దుండగులు చొరబడ్డారు.స్థానిక ప్రొటెస్టంట్ చర్చి ఫాస్టర్తో పాటు 24 మందిపై కాల్పులు జరిపారు. అనంతరం చర్చిలోని స్టోర్రూమ్లోకి చొరబడి నిల్వ ఉంచిన బియ్యాన్ని, ఆయిల్ను ఎత్తుకెళ్లారు. కాల్పులకు పాల్పడిన అనంతరం దుండగులు మోటార్ సైకిళ్లపై పారిపోయినట్టు మేయర్ తెలిపారు. ఈ ఘటనకు ఉగ్రవాదంతో సంబంధంలేదని అన్నారు. ఇది కచ్చితంగా దోపిడీ దొంగల పనేనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.