Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో : జపాన్లో 65 మందికి కోవిడ్-19 సోకినట్టుగా గుర్తించారు. దీనికితోడు జపాన్ తీరంలో ఉన్న క్రూజ్షిప్ లో వం దల సంఖ్యలో బాధితులు ఉన్నారు. ఈ నేపథ్యంలో జపాన్ చక్రవర్తి నరుహితో ఈనెల23న జరగాల్సిన తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకున్నట్టు ప్రకటించారు. దేశంలో ఎక్కడా కూడా వేడుకలు నిర్వహించవద్దని, వైరస్ సంక్రమిస్తున్నచందున పెద్ద సంఖ్యలో జనం ఒక్క చోటికి చేరడం మంచిది కాదని జపాన్ అధికారులు ప్రకటించారు.